వెంటిలేటర్’పై రాందేవ్ బాబా.. ఇదీ నిజం !

యోగా గురువు బాబా రామ్ దేవ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాందేవ్ బాబా కరోనా బారినపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయ్ కూడా. దీంతో రాందేవ్ బాబా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. స్వామిజీకి ఇదేం పరిస్థితి అని వాపోతున్నారు.

అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఇది 2011లో తీసిన ఫోటో. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా తొమ్మిది రోజుల నిరాహార దీక్ష చేసిన తరువాత బాబా రామ్‌ దేవ్ డెహ్రాడూన్‌లో ఆసుపత్రి పాలైనప్ప‌టి ఫోటో ఇది. ఇప్పుడీ.. ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రామ్ దేవ్ బాబా ఆసుపత్రిలో చేరార‌ని,వెంటిలేటర్ మద్దతుతో ఉన్నార‌ని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చూసి.. రాందేవ్ బాబా అభిమానులు భయపడాల్సిన అవసరం లేదు.