TSలో 4,305 కేసులు.. 29 మరణాలు !

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 4,305 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 29 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 5,20,709కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 2896కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 54,832 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నల్గొండలో 246, కరీంనగర్‌లో 229, ఖమ్మంలో 222 కేసులు నమోదయ్యాయ్. మరోవైపు కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చిన లాక్ డౌన్ పదిరోజుల పాటు (మే 21) కొనసాగనుంది. ఆ తర్వాత కూడా మరో పదిరోజుల పాటు లాక్ డౌన్ పొడగిస్తారని సమాచారమ్.