ఆ ధీర వనిత ఇక లేదు !

ఇటీవల సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అయింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా.. బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు. ఆ యువతి కూడా మానసికంగా కృంగిపోకుండా ధైర్యంగా కనిపించింది. హే జిందగీ అనే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసింది. ఆమె పిక్ కరోనా వచ్చిందని కంగారు పడుతున్న వారిలో స్పూర్తిని నింపింది.

అయితే ఆఖరికి ఆ ధీర వనిత కరోనాతో పోరాటం ఓడిపోయారు. లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ ధీర వనిత గురువారం రోజున చికిత్స పొందుతూ మరణించినట్టు ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ మోనిత ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఆ యువ‌తి వ‌యసు కేవ‌లం 30 ఏళ్లు. ఆమెకు ఓ చిన్నారి కూడా ఇంటి వద్ద ఎదురు చూస్తోందని గ‌తంలో మోనికా ఓ ట్వీట్‌లో తెలిపింది. యువతి మరణ వార్త తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

I am very sorry..we lost the brave soul..
ॐ शांति .. please pray for the family and the kid to bear this loss🙏😭 https://t.co/dTYAuGFVxk— Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 13, 2021