విషాదం : కోవిడ్ తో టాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. కరోనాతో యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి.. ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాతో నంద్యాల రవి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ ‘పవర్ ప్లే’ సినిమాలకు రచయితగా పని చేశారు.

ఇటీవలే ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్నార్ కరోనాతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త మరవకముందే.. టాలీవుడ్ మరో విషాదం నెలకొంది. నంద్యాల రవి ఆసుపత్రి బిల్లు రూ. 7లక్షలు అయ్యాయని తెలిసి.. కమెడియన్ సప్తగిరి తనవంతుగా రూ.లక్ష అందించారు. మరికొందరు కూడా సాయం చేసినట్టు తెలిసింది. అయినా.. నంద్యాల రవిని కాపాడుకోలేకపోయారు. ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.