28న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. చర్చించనున్న అంశాలివే !

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన ఈ నెల 28న ఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. వర్చువల్‌గా ఈ భేటీ జరగనుంది. 43వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఇది. కొవిడ్‌-19 సంబంధిత ఔషధాలు, ఆక్సిజన్‌ పరికరాలు, వ్యాక్సిన్లు వంటి వాటిపై పన్ను రేట్ల అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.దీంతో పాటు కరోనా వేళ రాష్ట్రాల ఆదాయం, జీఎస్టీ పరిహారం బకాయిలు, పెట్రోల్‌, డీజిల్‌ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వంటి పలు అంశాలు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

వర్చువల్‌గా జరగనున్న ఈ సమావేశానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌ ట్వీట్‌ చేశారు. ఏటా కనీసం మూడు నెలలకోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అవ్వాల్సి ఉంది. కానీ, చివరికి సారిగా గతేడాది అక్టోబర్‌ 5న భేటీ జరిగింది. ఈ క్రమంలో వర్చువల్‌గా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ఆర్థికమంత్రులు నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. 

Smt @nsitharaman will chair the 43rd GST Council meeting via video conferencing at 11 AM in New Delhi on 28th May 2021. The meeting will be attended by MOS Shri @ianuragthakur besides Finance Ministers of States & UTs and Senior officers from Union Government & States.— NSitharamanOffice (@nsitharamanoffc) May 15, 2021