TSలో 3,816కేసులు, 27 మరణాలు !

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,816 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది.  మొత్తం మృతుల సంఖ్య 2,955కి చేరింది. 

జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. తాజాగా కరోనా నుంచి 5,892(మొత్తం 4,74,899) మంది కోలుకున్నారు. మరో 50,969 మంది చికిత్స పొందుతున్నారు.