ఇలియానా కొత్త బిజినెస్

ఇలియానాకి టాలీవుడ్ లైఫ్ ఇచ్చింది. తెలుగు తొలి కోటి అందుకున్న కథానాయిక ఇల్లీనే. అలాంటి టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ కి వెళ్లిన ఇల్లీకి బొత్తిగా కలసి రాలేదు. దీంతో ఇలియానా సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది. లాక్ డౌన్ తర్వాత చైన్ రెస్టారెంట్లు, బేకరీలు మొదలు పెట్టే ఆలోచనలో ఇలియానా ఉన్నట్టు తెలుస్తోంది. తన పేరుతోటే వీటిని మార్కెట్ చేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు తన ఇన్ స్టా వేదికగా అభిమానులకి హింట్ ఇచ్చింది. తాను తయారుచేసిన చాక్లొట్ కేక్ వీడియోని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. సూపర్ టేస్టీ అంటూఇది నాకు ఆల్టర్నేట్ కెరీర్ అవుతుందని భావిస్తున్నానంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేసింది.

ఇల్లీకి సినిమాలు తగ్గాయి. లవ్ ఫెయిలైంది. ప్రియుడు ఆండ్రూ నీబోన్ కి బ్రేకప్ చెప్పేసింది. లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేసే సమయంలో సినిమా లైఫ్ ని కూడా పక్కనపెట్టిన ఇలియానా.. ఇప్పుడు కొత్త తరంతో పోటీ పడలేకపోతోంది. ఈ నేపథ్యంలో సైడ్ బిజినెస్ పై ఫోకస్ పెడుతోంది.ఇప్పటికే డిజైనరీ గార్మెంట్స్ బొటిక్ ఉంది. ముంబయి, హైదరాబాద్ లో దానికి బ్రాంచీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో కొత్త బిజనెస్ మొదలు పెట్టబోతుంది. బేకరి బిజినెస్ చేయబోతుంది. హీరోయిన్ గా ఫేడ్ అవుటైన ఇల్లీ.. బిజినెస్ ఉమెన్ గా ఏ మేరకు రానిస్తుంది అన్నది చూడాలి.