ఢిల్లీలో లాక్ డౌన్ పొడగింపు

కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత 19నే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి దేశరాజధానిలో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోవారం రోజుల పాటు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు సీఎం క్రేజీవాల్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం సాయంత్రం 5గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు.

లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తోంది. కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో వారంరోజుల పాటు లాక్ డౌన్  విధించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లేదంటే.. ఇన్నాళ్లు పడిన కష్టం వృధా అవుతుందని తెలిపారు. క్రేజీవాల్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఆలోచిస్తోంది. మిగితా రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తే.. ఆదాయం తగ్గుతుందని ఆలోచిస్తున్న టైమ్ లో క్రేజీవాల్ లాక్ డౌన్ ని ఆశ్రయించారు. అది మంచి ఫలితాలు ఇస్తుంది కూడా.

#WATCH | Delhi Chief Minister Arvind Kejriwal says, “We are extending the lockdown for one more week. Instead of tomorrow, lockdown is extended till next Monday, 5 am in Delhi.” pic.twitter.com/Z7cO361LlR— ANI (@ANI) May 16, 2021