ఏంజెలినా జోలీ బెడ్ పై పూరి జగన్నాధ్.. అలా తృప్తి చెందాడు !

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్  కు హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ అంటే బాగా ఇష్టం. పిచ్చి. ప్రపంచంలోనే ఆమె అంత అందగత్తె లేదంటాడు. అలాంటి పూరి ఓసారి వెనిస్ వెళ్లాడు. ఏంజెలినా జోలీ బెడ్ పై వాలిపోయాడు. అలాగని ఆమెతో రొమాన్స్ చేయలేదు. అసలు ఆమెని కలవనే లేదు. మరీ.. బెడ్ పై వాలిపోవడం ఏంటీ అనుకుంటున్నారా ? 

అది పూరి మాటల్లోనే వింటే..  “ఓసారి నేను వెనిస్ వెళ్లాను. టూరిస్ట్ అనే సినిమా కోసం వెనిస్ వచ్చిన ఏంజెలినా జోలీ అప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్లిందని తెలిసింది. వెంటనే నేను అదే హోటల్ కు వెళ్లి, షూటింగ్ కోసం రూమ్ కావాలని మేనేజర్ కు అబద్ధం చెప్పి, ఆమె రూమ్ కు వెళ్లి, మేనేజర్ తో సొల్లు మాట్లాడుతూ ఆమె పడుకున్న మంచంపై కాసేపు కూర్చొని వచ్చాను. తనకు అదో తృప్తి” అని చెప్పుకొచ్చాడు పూరి.

ప్రస్తుతం పూరి ‘లైగర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ-అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూరి, విజయ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. పూరి-కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.