TSలో 3వేలు దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో  3,982 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. కొత్తగా మరో 27 మంది కరోనాకు బలయ్యారు. దీంతో  మొత్తం మృతుల సంఖ్య 3,012కి పెరిగింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 48,110 క్రియాశీల కేసులున్నాయి. మరో 5,186 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. మరోవైపు కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా మరో పదిరోజుల పాటు.. అంటే మే 31 వరకు లాక్ డౌన్ పొడగించే అవకాశాలున్నాయని సమాచారమ్.