కరోనా సాయం : టాలీవుడ్ హీరోలపై పొలిటికల్ ప్రెజర్

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ పలువురు ప్రముఖులు గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సాయం కావాలా.. జస్ట్ మిసిడ్ కాల్ ఇవ్వండి’ అని సోనూసూద్ ప్రకటించారు. సోనూసూద్ నుంచి సాయం పొందుతున్న వాళ్లలో సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు ఉన్నారు. సురేష్ రైనా, మరికొందరు క్రికెటర్లకు సోనూ సాయం చేశారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ప్రధాని అయితే.. అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

ప్రభుత్వాలు చేయాల్సిన పనిని సోనూసూద్ చేస్తున్నారు. చిటికె లో సాయం అందిస్తున్నారు. ఆయన కనిపించే దేవుడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సోనూసూద్ అర్హుడు కూడా. ఇక కోలీవుడ్ ప్రముఖులు కరోనా సాయం చేస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. ఐతే టాలీవుడ్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఒక్కరంటే.. ఒక్కరు పైసా తీయడం లేదు. పైగా మాస్కులు పెట్టుకోండి.. చేతులు కడుక్కోండి అంటూ.. వీడియో సందేశాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్, అందులోనూ మెగా హీరోలపై సోషల్ మీడియాలో సటైర్స్ పడుతున్నాయి. ఇప్పుడు వారిపై పొలిటికల్ ప్రెజర్ కూడా మొదలైంది. 
 సోనూసూద్ ను చూసి తెలుగు హీరోలు, హీరోయిన్లు కళ్లు తెరవాలని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనా బాధితులకు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. దీంతో కరోనా సాయం విషయంలో ఇటు ప్రేక్షకులు, అటు సోషల్ మీడియా.. ఇప్పుడు పొలిటికల్ ప్రెజర్ మొదలైంది. ఇప్పటికైనా టాలీవుడ్ ప్రముఖులు సాయం చేయడాని  ముందుకొస్తారా ? లేక అన్నది తమని కాదులే అని.. లైట్ తీసుకుంటారా ?? చూడాలి.