రామ్ కుటుంబంలో తీవ్ర విషాదం

హీరో రామ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రామ్‌ తాతయ్య కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రామ్ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు. ఐతే కరోనా కారణంగా తాతయ్య మృతి చెందారు. వృద్ద్యాప్య సమస్యలతోనా అన్నది రామ్ పేర్కొనలేదు.

“తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు.

జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా” అని రామ్ ఎమోషనల్ ట్విట్ చేశారు.

From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King.

You’ve shown us that richness comes not from what’s in your pocket but from what lies in your heart.
1/2 pic.twitter.com/TLBvzWRaiT— RAm POthineni (@ramsayz) May 18, 2021