ఏపీకి సోనూసూద్ రూ.3కోట్ల సాయం !

బాలీవుడ్ నటుడు సోనూసూద్.. ఇప్పుడు కనిపించే దేవుడు అయ్యాడు. కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి ఆయన సాయం మొదలైంది. అది అలా నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది. కష్టాల్లో ఉన్నామని అడిగిన‌వాళ్ల‌కూ, అడ‌గ‌నివాళ్ల‌కు సైతం వ‌రాలు కురిపిస్తున్నాడు. తాజాగా క‌ర్నూలు కేంద్రంగా ఓ ఆక్సిజ‌న్ ఫ్లాంట్ ని నిర్మించ‌డానికి రెడీ అయ్యాడు. 

క‌ర్నూలు జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి అనుసంధానంగా ఓ ఆక్సిజ‌న్ ప్లాంట్ నెల‌కొల్ప‌డానికి సోనూసూద్ ముందుకొచ్చాడు. దీని విలువ దాదాపు 3 కోట్ల‌రూపాయ‌లు ఉంటుంద‌ని స‌మాచారం. దాదాపు 200 ప‌డ‌క‌ల‌కు ఈ ప్లాంట్ ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.మాకో ఆక్సిజ‌న్ ఫ్లాంట్ కావాలంటూ జిల్లాల‌వారిగా సోనూసూద్‌కి విన్న‌పాలు అందుతున్నాయి. అందులో భాగంగా క‌ర్నూలులో ఆక్సిజ‌న్ ఫ్లాంట్ ఏర్పాటు చేయ‌డానికి సోనూ ముందుకొచ్చాడు. దాని విలువ దాదాపు రూ.3కోట్లని తెలిసి.. జనాలు ఆశ్చర్యపోతున్నారు. అభినందిస్తున్నారు.