వాళ్లందర్నీ నేను చంపేస్తా

స్టార్ హీరోయిన్ సమంత ఒక్కసారిగా క్రూరంగా మారింది. ‘వాళ్లందర్నీ నేను చంపేస్తా’ అంటూ రంగంలోకి దిగింది. సామ్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్‌2’. రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.   మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత అక్కినేని ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.  తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. గత సీజన్‌ మాదిరిగానే శ్రీకాంత్‌ తివారీ పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఆకట్టుకున్నారు.ఇందులో ఆమె రాజీ అనే ఉగ్రవాది పాత్రలో కనిపించనున్నారు.

‘ది ఫ్యామిలీ మేన్‌-2’ ట్రైలర్‌ విడుదలయ్యింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మేన్‌’కి ఇది స్వీకెల్‌. చ్ బుధవారం ఉదయం ఈ సిరీస్‌ ట్రైలర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. గత సీజన్‌ మాదిరిగానే శ్రీకాంత్‌ తివారీ పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఆకట్టుకున్నారు.రాజీ కుట్రలను భగ్నం చేసి, ఆమెను అరెస్ట్‌ చేయడానికి శ్రీకాంత్‌ ఏవిధమైన ప్రయత్నాలు చేశాడు అనేది తెలియాలంటే మరి కొన్నిరోజులు ఎదురు చూడాల్సిందే. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 4న ఈ కొత్త సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.