ఏపీలో 20,937కేసులు, 104 మరణాలు !

ఏపీలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ 20వేలకుపైగా కొత్త కేసులు, వందకు పైగా మరణాలు సంభవిస్తున్నాయ్. గడిచిన 24 గంటల్లో ఏపీలో 20,937 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 104 మంది కరోనాకి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 15,42,079కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 9,904కి పెరిగింది.

ఈరోజు 20,811 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక మృతుల్లో అత్యధికంగా చిత్తూరులో 15 మంది,  ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10 మంది, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది, కృష్ణా జిల్లాలో 8 మంది, అనంతపురం, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.