TS కరోనా రిపోర్ట్ : 3,464 కేసులు, 25 మరణాలు

తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3,464 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,47,727 చేరింది. తాజాగా 25 ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,085కి పెరిగింది.

 ఈరోజు 4,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 534 మందికి కొత్తగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది.