#RRR రూ.325 కోట్ల డీల్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. దీంతో ఆర్ ఆర్ ఆర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజెనెజ్ జరుగుతోంది. 

ఈ సినిమా పోస్ట్‌ రిలీజ్‌ డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులను జీ గ్రూప్‌ వారు భారీ మొత్తం చెల్లించి సంపాదించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రూ.325 కోట్లను జీ గ్రూప్‌ ఈ టీమ్‌కి చెల్లించినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదొక రికార్డు అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమురం భీమ్‌గా తారక్‌, ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నరు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.