ఎల్.గోపి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ చిత్రకారుడు ఎల్.గోపి(69) కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఎల్‌.గోపి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. గోపి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు తన కుంచెతో అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. గోపి మరణంతో తెలంగాణ గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందన్నారు. గోపి కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

1970, 80 దశకంలో గోపి మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు. గోపీ అంత్యక్రియలు శుక్రవారమే పూర్తయ్యాయి. బంజారాహిల్స్‌ మహాప్రస్థానంలో సాయంత్రం ఆయనకు కొవిడ్‌ నిబంధనలను అనుసరించి దహన సంస్కారాలు నిర్వహించారు.