TSలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉదయం 10.10 తర్వాత ఎవరూ బయట తిరుగకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ ని అమలు చేస్తున్నారు పోలీసులు. నగరంతో పాటు జిల్లాల్లోనూ వాహనాల తనిఖీని పోలీసులు మమ్మురం చేశారు.

పాస్‌లు, అనుమతులు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పంజాగుట్ట, బంజారాహిల్స్‌, బేగంపేటలో లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా భారీ సంఖ్యలో వాహనాలు బయటికి రావడంతో పోలీసులు తనిఖీలు చేసి పదుల సంఖ్యలో కార్లు, బైకులను సీజ్ చేశారు.