బ్లాక్ ఫంగస్.. సోనియా ఓ సూచన.. ఓ డిమాండ్

కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇందులో కొన్ని సూచనలు చేశారామె.

బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ‘ఆంఫోటెరిసిన్-బి’ ఔషధానికి కొరత ఏర్పడింది. వెంటనే ఈ ఔషధం అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీని కోరారు. అలా బ్లాక్‌ ఫంగస్‌గా పేర్కొంటున్న మ్యూకోర్‌ మైకోసిస్‌ చికిత్సను ఉచిత వైద్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.