TSలో 3308 కేసులు, 21 మరణాలు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 3308 కొత్త కేసులు నమొదయ్యాయి. మరో 21 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,51,035 కేసులు నమోదయ్యాయి. వీరిలో 5,04,970మంది కోలుకోగా.. 3106మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42,959 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇక గడిచిన 24గంటల్లో తెలంగాణలో 4723మంది కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 513 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 200లకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.  తెలంగాణలో రికవరీ రేటు 91.64శాతం ఉండగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.