సెప్టెంబర్ 19 నుంచి మిగిలిన ఐపీఎల్.. వేదిక ఎక్కడో తెలుసా ?

దేశంలో కరోనా సెకండ్ విజృంభణ కారణంగా ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలిన ఐపీఎల్ కు వేదికగా, డేట్ ఖరారు చేసింది బీసీసీఐ. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ పందొమ్మిదో తేదీ నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 

ఇంగ్లాండ్‌తో పాటు శ్రీలంక కూడా మిగిలిన ఐపీఎల్ నిర్వహణకు తమ అంగీకారం తెలిపినా అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్‌నే బీసీసీఐ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఇక ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా నేరుగా యూఏఈ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై, బెంగళూరు ఐదు విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ముంబయి ఇండియన్స్‌ నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది.