రేపటి నుంచి జూడాల సమ్మె

సీఎం కేసీఆర్ సర్కారు హామీలు ఇచ్చుడే.. కానీ వాటిని అమలు చేయడం మాత్రం లేదు. కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీ కిందికి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించినా… అది ఇప్పటి వరకు అమలు కాలేదు. జూడాలకు ఇచ్చిన హామీ కూడా ఇంతే. పెంచిన స్టైపండ్‌, ప్రోత్సాహకాలు ఇప్పవరకు అమలు చేయలేదు.

ఈ నేపథ్యంలో రేపటి నుంచి జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేయనున్నారు. అత్యవసర సేవల మినహా, విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకుంటే 28వ తేదీ నుంచి అన్ని విధులు బహిష్కరించాలని నిర్ణయించారు.