TSలో కరోనా తగ్గుముఖం

తెలంగాణలో లాక్‌డౌన్‌ మంచి ఫలితాలనే ఇస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో TSలో 3762 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 20 మంది కరోనాతో మృతి చెందారు. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవి చాలా తక్కువనే చెప్పాలి. 

తాజా కేసులతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5,63,903 మంది కరోనా బారిన పడ్డారు. మృతి చెందిన వారి సంఖ్య 3,189 చేరింది. తాజాగా 3,816 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం 5,22,082 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 

ఇక కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుగా పదిరోజుల పాటు (మే 12-21) లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది. ఐతే అది మంచి ఫలితాలని ఇస్తుండటంతో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తూ.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.