డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కాలికి తగిలిన తీగ బాలీవుడ్ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ఎన్ సీబీ విచారణని ఎదుర్కొన్నారు.

సెప్టెంబర్‌ 2020లో సుశాంత్ ఫ్లాట్‌మేట్‌, హైదరాబాద్‌ నగరానికి చెందిన సిదార్థ్‌ పితానీని కొన్ని రోజుల పాటు విచారణ చేసింది. తాజాగా డ్రగ్స్‌ కోణం ఉండటంతో హైదరాబాద్‌ నగరంలో సిదార్థ్‌ పితానీని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్ జరిగినట్టు అయింది.