ఢిల్లీలో ఈటెల.. ఏం చేస్తున్నారు ?

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఈటల ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈటెలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారమ్.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈటల భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా అపాయింట్‌మెంట్ దొరికిన వెంటనే ఢిల్లీకి ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే బీజేపీలో చేరతారా ? లేక మళ్లీ ఇది చర్చల కోసమేనా ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.