తెలంగాణలో లాక్ డౌన్ మరో పదిరోజులు పొడగింపు

తెలంగాణలో లాక్ డౌన్ ని మరో పది రోజులు పొడగించారు. అయితే సడలింపు సమయాన్ని 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచారు. అంతేకాదు.. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వాళ్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు.. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం కూడా ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలు  చేయాలని నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ముందుగా సడలింపు సమయాన్ని ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట్లకు మాత్రమే పొడగించాలని అనుకున్నారు. కానీ కేబినేట్ చర్చ తర్వాత ఆ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడగించారు. సడలింపు సమయాన్ని పొడగించడం వెనక ఆర్థిక రంగాన్ని గాడిలోకి తీసుకొచ్చేందుకేననని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ తెలిపారు.