DK కొత్త అవతారం

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ కొత్త అవతారం ఎత్తనున్నాడు. కామెంటరీ చేయబోతున్నాడు. ఇతర దేశాల్లో వీడ్కోలు తీసుకోకముందే వ్యాఖ్యానం చేస్తుంటారు.. అందుకే తానూ కామెంటరీ చేయబోతున్నానని డీకే తెలిపారు. ఈ సందర్భంగా రిషబ్ పంత్, సాహా ల గురించి మాట్లాడాడు.

రిషభ్‌ పంత్‌ ప్రత్యర్థి మనసులో భయం పెంచుతాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ ప్రత్యర్థిపై చూపించిన ప్రభావమే అతడూ చూపిస్తున్నాడు అని కార్తీక్‌ అన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్‌ కీపర్లలో సాహా ఒకడని ప్రశంసించాడు. రిషభ్‌ పంత్‌ అద్భుత బ్యాటింగ్‌ మెరుపులతో సాహాకు చోటు దొరకడం లేదని అభిప్రాయపడ్డాడు.  ఇక తన కెరీర్‌ సాగిన తీరుకు గర్వపడతానని డీకే తెలిపాడు. జట్టులో దొరికిన ప్రతి అవకాశాన్నీ ఆస్వాదించానన్నాడు.