ఎన్టీఆర్ స్థానంలో అల్లు అర్జున్ వ‌చ్చి చేరాడా.. బుచ్చి ?

తొలి సినిమాతో హిట్ కొడితే ఆ కిక్కే వేరు. ఉప్పెనతో ఆ కిక్కుని అనుభవించాడు బుచ్చిబాబు సనా. సుకుమార్ శిష్యుడైనా, తొలి సినిమాతో త‌న‌దైన ముద్ర వేశాడు. ఉప్పెన ఏకంగా రూ. 50పైనే వసూలు చేసింది. దాంతో బుచ్చికి ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి. అయితే బుచ్చి టార్గెట్ ఎన్టీఆర్. రెండో సినిమా ఆయనతోనే. మైత్రీ మూవీస్ నే నిర్మించనుంది. తారక్ కోసం బుచ్చి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథని రాసుకున్నాడు అనే కథనాలు వినిపించాయి. అయితే ఇటీవల తారక్ ప్రకటించిన తన సినిమా షెడ్యూల్స్ లో బుచ్చి పేరు లేదు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల సినిమా, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని మాత్రమే తారక్ చెప్పారు.

ఈ నేపథ్యంలో బుచ్చి.. తారక్ స్థానంలో అల్లు అర్జున్ ఎంచుకున్నట్టు సమాచారమ్. బన్నీతో బుచ్చి మంత‌నాలు ప్రారంభించిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. వీరిద్ద‌రి మ‌ధ్య కొన్ని రోజులుగా క‌థా ప‌ర‌మైన చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం. ఈ కాంబోని కూడా మైత్రీ మూవీస్‌నే తెర‌పైకి తీసుకొచ్చింద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ ఉండనుంది. ఊరమాస్ దర్శకుడు బోయపాటి కూడా బన్నీ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందులో బుచ్చి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరీ.. అవి ఫలిస్తాయేమో చూడాలి.