ఆనందయ్య మందు తీసుకున్న జగపతి

ఆనందయ్య కరోనా ఔషధంపై ఎన్నో అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అవన్నీ తొలగిపోయి.. ఆనందయ్య మందు పంపిణీకి కోర్టు, ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆనందయ్య ఔషధం పంపిణీ కొనసాగుతోంది.

ఆనందయ్య మందు కోసం సామాన్య ప్రజలే కాదు.. సెలబ్రెటీలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తాను ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధాన్ని తీసుకున్నానని నటుడు జగపతిబాబు తెలిపారు. ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు వాడిన వాళ్లలో నేనూ ఒకడిని. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా. ఆయుర్వేద తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాత అంతా మంచే జరుగుతుందని డోస్‌ తీసుకున్నా. ఇప్పటివరకూ నాకెలాంటి కరోనా రాలేదని జగ్గూభాయ్ చెప్పారు.