ఘోర రైలు ప్రమాదం.. 50 మంది మృతి !

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు.. పట్టాలు తప్పి మరో ట్రాక్‌పై పడింది. ఈ క్రమంలో రావాల్పిండి నుంచి కరాచీ వెళ్తున్న రైలు ఎదురుగా వచ్చి పట్టాలపై పడి ఉన్న బోగీలను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుంది. ఈ ఘటనలో 50 మంది మృతి చెందారు. మరో 70మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రిని ఆదేశించారు.  ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అధికారులు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.15లక్షల చొప్పున అందజేయనున్నారు.