అనిల్ దర్శకత్వంలో శర్వా

కథల ఎంపికలో టేస్ట్ గల కథానాయకుడు శర్వానంద్. బలమైన కథ. దాన్ని ఎంటర్ టైనింగ్ గా చెప్పే దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు.. వీరిద్దరు కలవబోతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే అనిల్‌ శర్వానంద్‌కి కథను వినిపించాడని.. అందుకు శర్వా కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం శర్వా అజయ్‌ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్‌ మరో కథానాయకుడు. అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. మరో వైపు దర్శకుడు రావిపూడి ‘ఎఫ్‌3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్‌ – శర్వానంద్‌ల చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.