వాళ్లకు చెబుతున్నా.. మీరేం పర్‌ఫెక్ట్‌ కాదు !

‘బంగారం’తో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన సనూష.. ‘రేణిగుంట’, ‘జీనియస్‌’ చిత్రాలతో మెప్పించారు.  ‘జెర్సీ’లో జర్నలిస్ట్‌ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. కాస్త బొద్దుగా కనిపించే ఈ భామ ఇటీవల ఫిట్‌నెస్‌ పై ఫోకస్ పెట్టింది. నాజుగ్గా మారింది. స్లిమ్ గా మారిన ఫోటోలని తన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఐతే నెటిజన్లు ఆమెపై నెగెటివ్‌ కామెంట్లు చేశారు. శరీర బరువు గురించి నెగటివ్ కామెంట్స్ చేసారు. వాటిపై స్పందించిన సనూష నెటిజన్స్ పై అసహనం వ్యక్తం చేసింది.

“నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికీ చెప్పేది ఒక్కటే.. ఎదుటివాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన చేతి వేళ్లు మిమ్మల్నే చూపిస్తాయి. కాబట్టి, ఎదుటివాళ్లను అనే ముందు గుర్తుపెట్టుకోండి.. మీరేం పర్‌ఫెక్ట్‌ కాదు” అంటూ చురకలంటించింది.