ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ఇప్పటికే తెరాసకు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనను రాజీనామ చేయమని ప్రజలే ఆశీర్వదించారన్నారు. తెరాస బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు. కానీ గెలిపించింది ప్రజలు అని అన్నారు. అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇక ఇప్పటికే భాజాపాలో చేరుతున్నట్టు ప్రకటించిన ఈటెల.. 14న కమల తీర్థం పుచ్చుకోనున్నారు. అదేరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి ఈటల దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గండ్ర నళిని, బాబయ్య తదితరులు భాజపాలో చేరనున్నారు.