మరింత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 60,471 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 2,726 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 2.9కోట్లకు పైబడగా..3.7లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 9,12,378 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 1,17,525 మంది కోలుకోగా.. రికవరీ రేటు 95.43 శాతానికి పెరిగింది. మొత్తంగా 2.82కోట్ల మందికిపైగా వైరస్ నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.