WTC Final: కేన్‌ వచ్చేశాడు

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఏజియస్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ అందుబాటులో ఉండటం అనుమానమే అనే వార్తలు వినిపించాయ్. ఐతే తాజాగా విలియమ్సన్‌ పూర్తిగా కోలుకున్నాడు. ఫైనల్‌ ఆడనున్నాడు. వెన్నెముక గాయంతో దూరమైన వికెట్‌ కీపర్‌ బీజే వాట్లింగ్‌ సైతం అందుబాటులోకి వచ్చాడు. ఆ జట్టు కోచ్‌ గ్యారీ స్టీడ్‌ 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించాడు.

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బ్లండెల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, డేవాన్‌ కాన్వే, కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, టామ్ లేథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, బీజే వాట్లింగ్‌, విల్‌ యంగ్‌