కండలు వీరుడు.. రౌడీ హీరో !

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రంతో నేరుగా బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. లైగర్ రిలీజ్ కి ముందే బాలీవుడ్ ప్రేక్షకులని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే ‘డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్‌’లో విజయ్‌ మెరవబోతున్నాడు.క్యాలెండర్‌ షూట్‌లో భాగంగా కండలు తిరిగిన దేహంతో బైక్‌పై కూర్చొని మాస్‌ లుక్‌లో విజయ్‌ ఫొటోలకు పోజులిచ్చాడు. ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విడుదల చేశాడు.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో లైగర్ తెరకెక్కుతోంది. విజయ్‌ సరసన అనన్యపాండే సందడి చేయనుంది. ధర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై కరణ్‌ జోహార్‌, చార్మీ కౌర్‌, అపూర్వ మెహతా, యష్‌ జోహార్‌, పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ, తనిష్క్‌ సంగీతం అందిస్తున్నారు. 2021 సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.