ఈసారి చైతూ వంతు

కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ తో థియేటర్స్ అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇక థియేటర్స్ కి కాలం చెల్లినట్టే. ఇకపై ఓటీటీలదే హవా అనే ప్రచారం జరిగింది. పరిస్థితులు అలాగే కనిపించాయ్. అందుకే లాక్ డౌన్ ఎత్తేసి.. థియేటర్స్ తెరచుకున్నా.. పెద్ద సినిమాలేవీ రిలీజ్ కు సాహాసం చేయలేదు. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక్క అడుగు ముందుకేశాడు. తను నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చాడు. ప్రేక్షకులని తిరిగి థియేటర్స్ కి రప్పించాడు.

ఈ సారి సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఆ బాధ్యతని నాగ చైతన్య తీసుకోనున్నారు. ‘లవ్ స్టోరీ’ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. జులై సెకండ్ వారంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ తెరచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో జులై ఆఖరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలో లవ్ స్టోరీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాని చూసేందుకు జనాలు ఏ మేరకు వస్తారు ? అన్నదానిపైనే మిగితా సినిమాల భవిష్యత్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.