డ్రగ్స్ వాడుతూ.. రెడ్ హ్యాండెడ్’గా దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు, హీరోయిన్ల విచారణ ఎపిసోడ్లు చూశాం. అంతకుముందే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. పలువురిని విచారించారు కూడా. ఆ తర్వాత ఈ కేసు హోల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇక ఇటీవల కన్నడనాట కూడా డ్రగ్స్ కేసు సినీ ప్రముఖులని టెన్షన్ పెట్టింది. ఈ కేసుతో టాలీవుడ్ టు బాలీవుడ్ సినీ ప్రముఖులకి సంబంధాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. 

ఇప్పుడు మరో హీరోయిన్ డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయింది. తెలుగులో ఆది సాయికుమార్ చేసిన బుర్రకథ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన నైరా షా.. డ్రగ్స్ వాడుతూ అడ్డంగా దొరికిపోయింది. ముంబయి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా నైరాషాను పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమె బెయిల్ పై రిలీజైంది. ఆదివారం తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నైరా షా. బాయ్ ఫ్రెండ్ ఆషిక్ షాజిద్ హుస్సేన్ తో కలిసి జుహులోని ఓ స్టార్ హోటల్ లో పెద్ద పార్టీ ఇచ్చింది. అక్కడే ఆమెని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు పోలీసులు.