‘చిరు-మహేష్ మల్టీస్టారర్’పై క్లారిటీ

ఒకప్పుడు దూకుడు చూపించిన దర్శకుడు శ్రీను వైట్ల. స్టార్ హీరోలని డైరెక్ట్ చేశారు. వరుస హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఆయన్ని వరుసగా ప్లాపులు పలకరించాయ్. అయినా.. ప్రయత్నాలు ఆపడం లేదు. మరోసారి తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఢీ అండ్ ఢీ తీస్తున్నాడు. డ‌బుల్ డోస్‌ అనేది ఉప‌శీర్షిక. విష్ణు క‌థానాయ‌కుడు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. 

ఈలోగా ఓ రూమర్ పుట్టుకొచ్చింది. మహేష్, చిరులతో శ్రీను వైట్ల మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయ్. తాజాగా ఈ ప్రచారంపై వైట్ల స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదన్నాడు. అయితే ఢీ అండ్ డీ కాకుండా మరో రెండు కథలని రెడీ చేసుకున్నాడు వైట్ల. ఇందులో ‘డబుల్స్’ ఒకటి. ఇది మల్టీస్టారర్. అది కూడా స్టార్ హీరోల కోసం రాసుకొన్నది. కథ పూర్తయింది. కానీ హీరోలు ఎవరు అని ఇంకా వైట్ల కూడా అనుకోలేదు. ఢీ అంటే ఢీ తర్వాత మరో సినిమా ఉంటుంది. ఆ తర్వాత డబుల్ ఉంటుందని వైట్ల చెప్పారు.