గ్రేటర్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు !

గ్రేటర్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరు నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26, 28 తేదీల్లో, జులై 1, 4 తేదీల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు.

అంబేడ్కర్‌ నగర్‌ పీవీ మార్గ్‌లో 330, జీవైఆర్‌ కాంపౌండ్‌లో 180, పొట్టి శ్రీరాములు నగర్‌లో 162, గొల్లకుర్మయ్య కాలనీలో 10 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటిని లబ్దిదారులకు అందజేయనున్నారు. తెరాస అధికారంలోకి వచ్చే ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నిలబెట్టుకోలేదనే విమర్శలు ఉన్నాయ్. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన ఇళ్లని లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.