WTC Final తొలి సెషన్‌ ఆట రద్దు

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు అడ్డంకులు మొదలుపెట్టాడు. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాంతో పిచ్‌ను, మైదానంలో కొంత భాగాన్ని కవర్లతో కప్పారు. 

మ్యాచ్‌ ఆరంభానికి గంట ముందు అంపైర్లు మైదానంలోకి వెళ్లి పరీక్షించారు. జల్లులు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. దీంతో తొలి సెషన్‌ ఆట ఉండదని ప్రకటించారు. దాంతో అభిమానులు నిరాశపడ్డారు. మరోవైపు ఆటగాళ్లంతా వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురుచూస్తున్నారు.