ఘట్‌కేసర్‌లో 17యేళ్ల యువతి అనుమానాస్పద మృతి

ఘట్‌కేసర్ లో యువతి(17) అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన యువతి మృతదేహం పడి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో..  పోలీసులు  ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. దుండగులు హత్య చేసి పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు.

యువతిని పోచారం రాజీవ్ గృహకల్ప కాలనీ వాసిగా గుర్తించారు. మృతిచెందిన యువతి ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.