ఏపీలో ఎంసెట్‌ క్యాన్సిల్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఈప్ సెట్‌ను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 

ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని.. 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని ప్రభుత్వం ఓకే చేస్తే.. ఏపీలో ఎంసెట్ క్యాన్సిల్ అయినట్టే. అయితే కరోనా విజృంభణ దృష్ట్యా ఈ ఒక్క యేడాదియే ఎంసెట్‌కు బదులుగా ఈప్‌సెట్ నిర్వహిస్తారా ? లేక ఇకపై ప్రతి యేడాది ఇలాగే కొనసాగుతుందా ?? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.