కరోనా రిపోర్ట్ : మూడ్నెళ్ల కనిష్టానికి కొత్త కేసులు, మరణాలు

కరోనా పీడ క్రమంగా వదులుతోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో 53,256 కొత్త కేసులు నమోదయ్యాయ్. రోజువారీ కేసులు మూడు నెలల కనిష్ఠానికి చేరాయి. తాజాగా మరో 1,422 మంది మృతి చెందారు. ఏప్రిల్ 17 తరవాత మరణాల్లో ఈ స్థాయి తగ్గుదల తొలిసారి నమోదైంది.

ఇక ఇప్పటి వరకు 2,99,35,221 మందికి కరోనా సోకగా..3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు ఏడు లక్షలకు తగ్గగా..ఆ రేటు 2.44 శాతానికి పడిపోయింది. నిన్న 78,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2.88 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడగా.. రికవరీ రేటు 96.27 శాతానికి చేరింది.