హాస్పటల్ లో చేరిన మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ గిరిజన శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాస్పటల్ లో చేరారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఉన్నట్టుండి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో మంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పనట్టు తెలిసింది.