ఏపీ రాజధాని వివాదంలో యాంకర్ ప్రదీప్

యాంకర్, నటుడు ప్రదీప్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన చిక్కుకున్నది ఏ డ్రంక్ & డ్రవ్ లో కాదు. ఏకంగా ఏపీ రాజదాని వివాదంలో  చిక్కుకున్నాడు. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఏపీ రాజధాని విశాఖకు తరలి వెళ్లనుందని వైసీపీ ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు దీన్ని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.

జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ టీవీ షో సందర్భంగా అమరావతి రాజధాని విశాఖ అంటూ యాంకర్ ప్రదీప్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. హైదరాబాద్‌లో యాంకర్‌ ప్రదీప్‌ ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టులో ఉన్న రాజధాని అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని ఏపీ పరిరక్షణ సమితి ప్రశ్నిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది. సింపుల్ గా క్షమాపణలు చెప్పేసి.. ఈ వివాదం నుంచి ప్రదీప్ బయటపడతారా ? లేక తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని సమర్థించుకుంటారా ? అనేది చూడాలి.