సలార్ ని కూడా సగం సగం చూపించబోతున్నారా ?

‘బాహుబలి’ రెండు పార్టులుగా వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స్పూర్తితో రెండు పార్టీలుగా సినిమాలు క్యూ కట్టబోతున్నాయ్. ‘కేజీఎఫ్’ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ పార్ట్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇటీవల సింగిల్ సినిమా స్కిప్ట్ తో రెడీ అయిన కథలు డబుల్ అవుతున్నాయ్. రెండు పార్టులుగా రెడీ అవుతున్నాయి. ‘పుష్ప’ సినిమాని మొదట సింగిల్ సినిమాగానే అనుకున్నా.. ఆ తర్వాత సగం సగం చేసి.. రెండు పార్టీలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు సలార్ ని కూడా సగం సగం చూపించబోతున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్. కేజీఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్న చిత్రమిది. ప్రభాస్ ని ఓ రేంజ్ లో చూపించేందుకు ప్రణాఌకలు సిద్ధం చేసుకున్నారు. రెండు పార్టుల ఆలోచనకు ప్రభాస్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయన ఓకే అంటూ సలార్ రెండు పార్టులుగా రానుంది.