TS ఎంసెట్ తేదీలను ఖరారు

తెలంగాణలో మళ్లీ మునుపటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేయడంతో.. అన్నీ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. కేజీ టు పీజీ క్లాసులు మొదలవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ టెస్టులని నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా తాజాగాఎంసెట్ తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు 5 నుంచి 9వరకు పరీక్షలు నిర్వహించనున్నామని ప్రకటించింది. ఆగస్టు 3న ఈసెట్ జరగనుంది.  ఆగస్టు 11-14 మధ్య పీఈసెట్ నిర్వహించనున్నారు. దాదాపు యేడాదిన్నర తర్వాత తెలంగాణలో చదువుల జాతర మొదలవ్వడం విశేషం.