ఏపీలో ఇంకా తగ్గని కరోనా మరణాలు

దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అయితే తెలుగు రాష్ట్రం ఏపీలో కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో ఏపీలో  4,169 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మరో 53 మంది కరోనాతో మృతి చెందారు. 

నిన్న 8,376మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో 53,880యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 18,57,352 కు చేరింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు 17,91,056మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అంతే కాకుండా 12,416 మంది కనా తో మృతి చెందారు.